ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న ఓటర్లు

2933చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామములో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిని ఓటర్లు అడ్డుకున్నారు. సోమవారం జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న ఆయనను టీడీపీ పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లు అడ్డుకున్నారు. ప్రశాంతంగా జరుతున్న సమయంలో వైసిపి నాయకులు ఒకరి తర్వాత ఎవరంటే వారు కేంద్రానికి రావడంతో పోలింగ్ నిలిపివేస్తున్నారు. ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి రావడంతో వారు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల, పోలీస్ శాఖ అధికారులు సర్ది చెప్పి ఆయనను బయటికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్