నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

62చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఉత్తర కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, శ్రీసత్యసాయి, అనకాపల్లి, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్