ఎన్నికల సంఘంపై సజ్జల సీరియస్

57చూసినవారు
ఎన్నికల సంఘంపై సజ్జల సీరియస్
ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ అధికారులు అంపైర్ లాగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని ఆరోపించారు. అసలు ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు.