కేంద్ర ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టు ప్రసాద్ స్కీం ద్వారా.. నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టూరిజం అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.