అనంతపురంలో క్లినిక్ ను సీజ్ చేసిన వైద్యాధికారులు

69చూసినవారు
అనంతపురంలో క్లినిక్ ను సీజ్ చేసిన వైద్యాధికారులు
అనంతపురంలోని రామచంద్రనగర్ లో లావణ్య క్లినిక్ ను గురువారం డిఎంహెచ్ఓ డా. దేవి సీజ్ చేశారు. అనుమతులకు విరుద్ధంగా కూడేరు మండలం హంసపల్లి గ్రామానికి చెందిన వేలూరు రాధ అనే మహిళకు శస్త్ర చికిత్స చేయడంతో ఆపరేషన్ వికటించింది. భర్త కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా వైద్యాధికారిణి దేవి ప్రాథమిక విచారణ చేసి ఆసుపత్రిని సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you