దుర్గ‌మ్మ గుడికి కల్తీ సరుకులు..వెలుగులోకి నిజాలు!

67చూసినవారు
దుర్గ‌మ్మ గుడికి కల్తీ సరుకులు..వెలుగులోకి నిజాలు!
విజయవాడ దుర్గగుడికి కల్తీ సరుకులు సరఫరా చేసినట్లు వెలుగులోకి షాకింగ్‌ నిజాలు బయటకు వచ్చాయి. విజయవాడ దుర్గమ్మ గుడికి నాసిరకం సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలకు రంగం సిద్ధం అయింది. సాయి మణికంఠ ఏజెన్సీ ద్వారా సరుకులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. గతంలో కూడా అన్న ప్రసాదానికి నాసిరకం బియ్యం సరఫరా చేసినట్టు గుర్తించారు. దుర్గగుడి లో కొందరు అధికారుల సహకారంతో వ్యవహారం నడుపుతు న్నట్లు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.

సంబంధిత పోస్ట్