నేడు ధర్మవరంలో పర్యటించనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

69చూసినవారు
నేడు ధర్మవరంలో పర్యటించనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మంత్రి మండ్లిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఆయన ధర్మవరంలో పర్యటిస్తారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో సాయంత్రం 4. 30 గంటలకు ధర్మవరం చేరుకుంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం అనంతపురం వెళ్తారు. 15న ఉదయం 9. 30 గంటలకు మళ్లీ ధర్మవరం చేరుకుని పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.