విజయవాడలో ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గమ్మను శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ రామారావు ఎంపీ బి. కె. పార్థసారథి ని ఘనంగా సన్మానించారు. వేదపండితులు ఎంపీ కి ఆశీర్వాదం అందజేశారు.