వరద బాధితుల కోసం నిత్యావసర సరకుల సేకరణ

80చూసినవారు
వరద బాధితుల కోసం నిత్యావసర సరకుల సేకరణ
పామిడి మండలం దేవరపల్లిలో టీడీపీ నాయకులు శుక్రవారం గడపగడపకూ తిరుగుతూ వరద బాధితుల కోసం బియ్యాన్ని సేకరించారు. టీడీపీ నాయకుడు ఆర్ఆర్ రమేష్ మాట్లాడుతూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు వరద బాధితుల కోసం నిత్యావసర సరకులను ఇంటింటా తిరిగి సేకరిస్తున్నామన్నారు. గ్రామంలో సుమారు 52 బియ్యం బస్తాలను సేకరించామన్నారు.

సంబంధిత పోస్ట్