టెక్కలి మండల కేంద్రం లోని ఇందిరా గాంధీ కూడలి వద్ద ఉన్న రైల్వే గేట్ శుక్రవారం ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో గేట్ వేయడం వల్ల బస్సు పై పడింది. ఆ గేట్ తొలగించేందుకు సుమారు అరగంట కాలం పట్టింది. బస్సులో ఉన్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు.