వృద్ధులతో పాటు అవ్వాతాతలు, దివ్యాంగుల చెంతకు వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందజేయకుండా అడ్డుపడి చంద్రబాబునాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ధ్వజమెత్తారు. ఇచ్చాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడని దుయ్యబట్టారు.