Mar 29, 2024, 02:03 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
జిల్లాలో ఆరుగురు కుష్ఠు రోగులు: డీఎంహెచ్ ఓ సుమన్ మోహన్ రావు
Mar 29, 2024, 02:03 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ కుష్టు నివారణలో భాగంగా ఈనెల 11 నుంచి 24 వరకు జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ కమైన్స్ పూర్తయిన సందర్భంగా గురువారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 1, 28, 936 ఇళ్లను వైద్యసిబ్బంది సందర్శించి 2, 119 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. ఆరుగురు కుష్ఠు వ్యాధిగ్రస్తులుగా తేల్చి వారికి చికిత్స అందిస్తున్నట్లు డిఎంహెచ్ ఓ సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు.