మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

76చూసినవారు
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోఢా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. పంజాబ్‌లోని లూధియానాలో గల ఎంపీ నివాసం, కార్యాలయంతో పాటు ఇతర వ్యక్తుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్