పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ ప్రచారం
నందిగాం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కూలీలతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను వివరించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జాతీయ సహాయ కార్యదర్శి బమ్మిడి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.