లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు

1070చూసినవారు
లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు
AP : గోదావరిలో వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడిచిపెడుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక గోదావరి వరదరేవులోకి వశిష్ఠ గోదావరి నుంచి వరద చేరింది. ఫలితంగా ఇక్కడి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. బూరుగులంక రేవుకు అవతల ఉన్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

సంబంధిత పోస్ట్