AP: అసెంబ్లీ స్పీకర్గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో చంద్రబాబు మార్క్ ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవి బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ఫైనల్ కావొచ్చని సమాచారం.ఇదే కానీ జరిగితే జనసేనకు చంద్రబాబు తొలి షాక్ ఇచ్చినట్లే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.