IPS బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

84చూసినవారు
IPS బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా, ఎన్నికల పోలింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో పల్నాడు ఎస్పీగా ఉన్న బిందు మాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you