చట్టబద్ధంగా పిల్లలను పొందాలనుకునే జంటల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి. అనేకమంది దత్తత కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దత్తత ప్రక్రియ జటిలం అవ్వడంతో చట్ట వ్యతిరేక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అనేక శిశు విక్రయ కేసుల్లో తల్లి, లేదా తండ్రి అనుమతితోనే జరిగిందని, దీంతో దత్తత తీసుకున్న వారు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. శిశువులను విక్రయించిన తరువాత అనేకమంది తమ పిల్లలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేస్తున్నారు.