125 వసంతాలు పూర్తి చేసుకున్న ఊటీ కొండ రైలు

67చూసినవారు
125 వసంతాలు పూర్తి చేసుకున్న ఊటీ కొండ రైలు
తమిళనాడులోని నీలగిరి కొండ రైలును ప్రారంభించి నేటికి సరిగ్గా 125 వసంతాలు. ఈ రైలు సేవలు 1899 జూన్‌ 15వ తేదీ మేట్టుపాళయం నుంచి కున్నూర్‌కు ప్రారంభమయ్యాయి. ఈ రైలును బ్రిటీష్‌ పర్యవేక్షణ ఇంజనీర్‌ జెఎల్‌ఎల్‌ మోరంట్‌ రూపొందించారు. ఆయనను స్మరించుకొనేలా శనివారం 125వ వార్షికోత్సవాలను నిర్వహించారు. అలాగే, కున్నూర్‌లో RCM చర్చి, వెల్లింగ్టన్‌ దేవాలయం, కూడలూరు చర్చి, లారెన్స్‌ పాఠశాల, ఊటీ బొటానికల్‌ పార్క్‌ కూడడా ఆయనే నిర్మించారు.

సంబంధిత పోస్ట్