పిల్లలు కావాలనుకోనేవారు ముందుగా care.nic.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత కావాల్సిన పత్రాలను అప్లోడ్ చేసి.. రూ.6 వేలతో డీడీ తీయాలి. ఈ వివరాలపై ICDSPD, మెడికల్ అధికారి, చైల్డ్ అధికారులు, శిశుగృహ పర్యవేక్షకులతో కూడిన రిపోర్టు కమిటీ విచారణ చేపడతుంది. సరైనవి అని ధ్రువీకరించిన తరువాతనే సదరు తల్లిదండ్రుల రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్కు మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.