మహిళ అనుమానాస్పద మృతి

55చూసినవారు
మహిళ అనుమానాస్పద మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ ఆరుళ్ల గ్రామ సమీపంలో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. అరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి (48) వారం క్రితం తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆరుళ్ల గ్రామస్తులు రహదారికి సమీపంలో భరించలేని దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలు సత్యవతిగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్