వైసీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడులు చేస్తోందంటూ వైసీపీ ఆరోపించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో వైసీపీ సానుభూతిపరులపై టీడీపీ గూండాలు దాడి చేశారని మండిపడింది. విచక్షణ రహితంగా కొట్టి కత్తులతో నరికి రాక్షసానందం పొందారంటూ ధ్వజమెత్తింది. పల్నాడు జిల్లాలో మళ్లీ గొడవలు, కక్ష్యలు కార్పణ్యాలకి టీడీపీ ఆజ్యం పోసిందని పేర్కొంటూ 'ఎక్స్'లో ఒక వీడియోను షేర్ చేసింది.