టీడీపీదే గెలుపు.. వైసీపీ నేత పందెం

77చూసినవారు
టీడీపీదే గెలుపు.. వైసీపీ నేత పందెం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. మరో మూడు రోజుల్లో కౌంటింగ్ ఉండటంతో.. అందరి కళ్లు జూన్ 4పైనే ఉన్నాయి. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై పందెంరాయుళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదిరిలో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని పందెం వేయగా.. మరొకరేమో వైసీపీ గెలుస్తుందని.. ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. అయితే వైసీపీకి చెందిన నేత కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.