ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బోధన తీరుపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘పేరెంట్ టీచర్-హోం-విజిట్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు బోధన జరిగే అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ కమిషనర్ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.