AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు వైసీపీ కార్యకర్తల ఇళ్లను టీడీపీ నేతలు కూల్చేశారు. దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్పై కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.