మాచర్లలో బ్రహ్మారెడ్డి లక్ష్యంగా దాడులు

69చూసినవారు
మాచర్ల టీడీపీ అభ్యర్థి జాలకంటి బ్రహ్మారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. రెంటాలలో టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో అక్కడికి బ్రహ్మారెడ్డి వెళ్లారు. వైసీపీ వర్గీయులు బ్రహ్మారెడ్డి వాహనశ్రేణిపై దాడిచేశారు. ఆయన కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలం లచ్చన్నబావితండాలో పోలింగ్‌ పరిశీలనకు వెళ్లగా ఆయన కాన్వాయ్‌లోని ఒక కారును వైసీపీ నేతలు కాల్చివేశారు.

సంబంధిత పోస్ట్