అర్ధరాత్రి గోడ దూకి పారిపోయిన విద్యార్థినులు

66చూసినవారు
అర్ధరాత్రి గోడ దూకి పారిపోయిన విద్యార్థినులు
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి పారిపోవడం సంచలనంగా మారింది. సోమవారం అర్ధరాత్రి 2.45 గంటలకు స్నానం చేసే బకెట్ల సాయంతో గోడ దూకి పరారైనట్లు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. మంగళవారం ఉదయం స్టడీ అవర్ కోసం పిలిచినప్పుడు ఇద్దరు విద్యార్థినులు కనిపించకపోవడంతో పాఠశాల ప్రత్యేకాధికారిణి ప్రమీల అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత పోస్ట్