ఏపీలో జూన్ 4 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ‘చంద్రన్న బీమా’ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, చాలా మంది జీవితాలు నాశనమైందన్నారు.