పసుపు పతి వస్తున్నాడు.. జాగ్రత్త: సీఎం జగన్

1581చూసినవారు
పసుపు పతి వస్తున్నాడు.. జాగ్రత్త: సీఎం జగన్
జిత్తులమారిన పొత్తుల ముఠాతో రోజూ యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు. ‘అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు. జాగ్రత్త’ అని చంద్రబాబును సీఎం జగన్ విలన్‌తో పోల్చారు.