జగన్ కనుసన్నల్లో అయిన వారికే ఐఏఎస్ పదవులు కట్టబెడుతున్నారని టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికే పదవులు కట్టబెడుతున్నారన్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధమన్నారు. ఫలితాలకు ముందే భోగాపురం పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు.