జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఇవాళ ఇటలీ వెళ్లనున్న నేపథ్యంలో ఖలిస్థానీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిన్న ధ్వంసం చేశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్కు అనుకూలంగా నినాదాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం అభ్యర్థించింది.