May 09, 2024, 08:05 IST/నర్సంపేట
నర్సంపేట
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
May 09, 2024, 08:05 IST
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్లో చేరారు. వారికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ తదితరులున్నారు.