టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షన.. కత్తులు, కర్రలతో దాడి (వీడియో)

62చూసినవారు
పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే గొడవకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్