తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిల మఠం 46వ జీయర్ రంగనాథ యతీంద్ర మహదేశికన్ మంగళవారం దర్శించుకున్నారు. ఈయనకు పెద్ద మర్యాదతో ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు శటారి మర్యాదతో వేదమంత్రోచ్ఛారణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మ్రోక్కుల తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు.