అమ్మవారి సేవలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా

63చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ లు శేషగిరి, చంద్రశేఖర్, సుభాస్కర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మంత్రికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్