చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మూడేప్ప సర్కిల్ వద్ద శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆర్పిఎఫ్ టీం సభ్యులు ఘన నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ కన్వీనర్ పూల హేమంత్ రాయల్, జనార్దన్ రాయల్, నాన బాల పెద్దమని. పూల భాస్కర్, నాన బాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.