అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్

1095చూసినవారు
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.