![క్వార్ట్జ్ అక్రమ నిల్వలపై విచారణ క్వార్ట్జ్ అక్రమ నిల్వలపై విచారణ](https://media.getlokalapp.com/cache/43/37/43371d3bcc6af4a9a726008664a3f66e.webp)
క్వార్ట్జ్ అక్రమ నిల్వలపై విచారణ
సైదాపురం మండల పరిధిలోని కమ్మవారిపల్లి గ్రామం సమీపంలో అక్రమంగా ఉన్న క్వార్ట్జ్ నిల్వలపై మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ చీకటి పడడంతో పాటు వర్షం కూడా కురుస్తున్నందున పూర్తిస్థాయి విచారణ చేపట్టలేకపోయామన్నారు. గురువారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు