ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు

56చూసినవారు
ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు
ఏఆర్ డైరీ సంస్థపై టీటీడీ చర్యలకు దిగింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు చేసింది. బుధవారం తిరుమలలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిందని, పోలీసులు కేసు నమోదు చేసి ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్