గేదెలను ఢీకొన్న వ్యాన్.. ఇద్దరి మృతి (వీడియో)

52చూసినవారు
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి సీతారామపురం వైపు వెళ్తున్న ఓ పేపర్ వ్యాన్ రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ శ్రీనివాసులను అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. వ్యానులో ఉన్న ఓ మహిళకు, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్