వైఎస్ షర్మిలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. "చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్పై నిందలు వేస్తున్నారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా? వివేకా హత్య కేసులో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారు. షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. సీఎం జగన్ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు." అని ఆమె ధ్వజమెత్తారు.