మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన ర్యాలీ

85చూసినవారు
మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన ర్యాలీ
మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం రామభద్రపురంలోని వేంకటేశ్వర జూనియర్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. యువత చెడు వ్యసనాల పట్ల ఆకర్శితులు కాకుండా ఆరోగ్యవంతమైన జీవితంపై ఆశలు పెంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి 3 రోడ్లు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు.

సంబంధిత పోస్ట్