అడుగుకో గుంత.. నడిచేదెట్లా సార్

81చూసినవారు
అడుగుకో గుంత.. నడిచేదెట్లా సార్
గత 3 ఏళ్లుగా కురుపాం దూలికేశ్వర ఆలయం పరిసర రోడ్లన్నీ తీవ్ర అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు. ఆలయం పక్కనే కురుపాం నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉందన్నారు. ఆలయం ముందు ఉన్న కాలువలో చెత్తనిండిపోయి మెయిన్ రోడ్ నుంచి వచ్చే మురుగు నీరు అవతలకు వెళ్లకుండా రోడ్డుపైకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని మా సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్