
గరుగుబిల్లి: అగ్నిప్రమాదంలో మూడు పెంకుటిల్లు దగ్ధం
మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో శనివారం మూడు పెంకుటిల్లులు అగ్నికి ఆహుతైన సంఘటన చోటుచేసుకుంది. ముడిల నారాయణ స్వామి, కళావతమ్మ, సరస్వతి ఇంట్లో ఎవరులేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ధాన్యం, గృహాపకారణాలు కాలిబూడిదయ్యాయని బాధితులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది సంఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.