మర్రిగూడలో ఎగిరిన ఇంటి పైకప్పు

79చూసినవారు
మర్రిగూడలో ఎగిరిన ఇంటి పైకప్పు
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మారిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని మర్రిగూడ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి శ్యామల రావు అనే వ్యక్తి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. లోపల వర్షం నీరు చేరి సామాన్లన్నీ తడిచి ముద్దయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్