Mar 31, 2024, 13:03 IST/ఖానాపూర్
ఖానాపూర్
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
Mar 31, 2024, 13:03 IST
బస్సులో దొరికిన డబ్బును అసలు యజమానులకు అప్పగించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కు చెందిన ఒక కుటుంబం ఆదివారం నిర్మల్ నుండి ఖా కు బస్సులో ప్రయాణించారు. స్థానిక ఐబీ వద్దకు రాగానే వారు బస్సు దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో వారు రూ. 18 వేలను బస్సులోనే మర్చిపోయారు. దీంతో బస్ కండక్టర్ శ్రీలత గుర్తించి కంట్రోలర్ జావిద్ సహాయంతో ఆ డబ్బును అసలు యజమానులకు అప్పగించారు.