ఎస్. కోట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
ఎస్. కోట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎస్ కోటలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజా దర్బార్) ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధా రాజు, సర్పంచ్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర కృషి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్