
వేపాడ: తాత్కాలిక వంతెన పై ఆటో బోల్తా
వేపాడ మండలం బలంకి నుండి ఆనందపురం కు వెళ్లే రహదారిలో ఆనందపురం సమీపంలో మరమ్మతులకు గురైన వంతెనపై నిర్మించిన తాత్కాలిక తాటి దుంగల కల్వర్టుపై మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కల్వర్టు మరమ్మతులకు గురై మూడు నెలలు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.