సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు తీరనిలోటని వక్తలు పేర్కొన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద జిల్లా కార్యాలయంలో గురువారం రాత్రి సంతాప సభ ఏర్పాటు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, సీనియర్ నాయకులు ఎ. అజశర్మ, బి. జగన్లు ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.