విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు కొత్తపాలెం ప్రాంతంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే గణబాబు శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి సందర్శించారు. పాడైన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. అందరూ అప్రమంతంగా ఉండాలన్నారు.